వియ్యాలవారి కయ్యాలు

Wednesday, November 23, 2022

“ఏం పని చేస్తరో?” అడిగాడు సురేశ్ తన పెళ్ళికొచ్చిన గోపాల్ ని. అతను అమ్మాయి వైపు చుట్టం కానీ రైలు తొందరగా వచ్చెయ్యడంతో, ఇంకా ఆడపెళ్ళివారు మంటపానికి రాక ముందే వచ్చిన మూలాన మాట కలిపాడు మర్యాదగా ఉంటుందని. "వ్యాపారం" అన్నాడు గోపాలం. "యాపారమా ఏం యాపారం?"అడిగాడు సురేశ్. " కొట్టు" అన్నాడు గోపాల్. "ఆ? ఏందీ" వినిపించనట్టు అడిగాడు సురేశ్ "కొట్టండీ.. కొట్టు కొట్టు" అని అన్నాడో లేదో గోపాల్ చెంప మీద ఫెళ్ళున కొట్టాడు సురేశ్. గోపాల్ ఈ దెబ్బకి నివ్వెరపోయాడు. పెళ్ళి కొడుక్కి కాస్త మెంటలా అని అనుమానమొచ్చేసింది ఒక నిమిషం లో.వాళ్ళ వాళ్ళు వచ్చారేమో అని చుట్టూ చూస్తున్నట్టు చేసి, నెమ్మదిగా జారుకున్నాడు.. చెప్పెయ్యాలి.. వాళ్ళ వాళ్ళు రాగానే చెప్పెయ్యాలని హాలు గేటు దగ్గరే నిరీక్షించాడు. " అదేందయ్య ఈడికొచ్చినవ్? పెండ్లి పిల్ల సైడ్ కెంచి చుట్టపాయనొచ్చిండు చాయ్ బిస్కీట్ అరుసుకోమంటె ఏడున్నడో అని దోలాడలేక పరేషానయితున్న.. హమ్మ దొర్కవట్టిన్నన్నట్టు" సంతోషం గా చెప్పుకుపోతున్నాడు ఎల్లయ్య. చుట్టపాయిన, టీ బిస్కీట్ తప్ప ఏమర్థమయినా కాకపోయినా, అరుచుకోవడమేంటీ ఆయన కొట్టినా కుక్కినపేనల్లే నోరుమూసుకుని ఉంటే మళ్ళీ ఈయన తీసుకెళ్ళి అరుస్తాడేమో అని అయోమయం గా చూస్తున్నాడు గోపాల్. " కొర్కతింటామయ్య బీరిపోయినవ్.. .. నడ్వు పోదాంపా" అంటూ రమ్మని తొందర చేసాడు ఎల్లయ్య. ఇదెక్కడ గోలరా బాబూ, అసలు వాళ్ళు “రాజమండ్రి వచ్చెయ్ బావా అందరం కలిసి వెళదాం సరదాగా” అంటున్నా, ఎలాగూ ఏదో పనిమీద హైదరాబాదొచ్చాను కదా.. ఇటునించిటే అయితే టైం , టికెట్టు కలిసొస్తుందని కక్కుర్తి పడ్డాను అనవసరం గా " అనుకుంటూ ఎందుకో వెనుతిరిగి చూస్తే దూరం నించి వస్తూ కనిపించాడు అప్పా రావు. గోపాల్ ఎల్లయ్య వైపు తిరిగి.. " ఒక్క నిమిషం ఆగండి, మా చుట్టం ఇంకొకడు వస్తున్నాడు, ఇద్దరం కలిసొస్తాము చాయ్ బిస్కీట్ కి " చివరి పదం యాస మార్చి అనేసాడు సంతోషం గా.. " కానియ్యున్రి, మేమేమన్న కాదన్నాము.. " అన్నాడు ఎల్లయ్య. గోపాల్, అప్పారావు ఒకరినొకరిని చూసుకుని చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టారు. దడ దడా మాట్లేసుకుంటున్న వాళ్ళని " గీ లొల్లెప్పటికొడిశేనో" అనుకుంటూ చూస్తున్న ఎల్లయ్యని సురేశ్ పిలవడంతో అటెళ్ళాడు. గోపాల్ , అప్పారావ్ కబుర్లలో పడి నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్న చోటకి నడవసాగారు. తను లేకుండా వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోవడం చూసిన ఎల్లయ్య.. " ఓ గోపాలూ, మీ చుట్టపాయన పెండ్లి పిలగాన్ని మందలించకుంటనే పోతడా" అని అరిచాడు. అప్పటి వరకూ పెళ్ళి పిలగాడు తనని కొట్టిన వైనం చెప్పి ఉన్న మూలాన కావచ్చు అప్పారావు చాన్స్ వదులుకోకుండా సురేశ్ దగ్గరగా వెళ్ళి " ఏం మనిషండీ మీరు, అసలు బుధ్ధుందా మీకు? మడిసన్నాక కూసింత కలాపోసనుండాల, .. లేదంతే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంది ? పొద్దున్నే ఇంత పచ్సగడ్డి తిని పెత్తెక్ష నారాయనుడి సేవ చేసుకోక..ఎందుకొచ్చిన గోలయ్యా , సెగట్రీ.. ఇలా సాగిపోతే మర్డర్రయిపోవూ " అన్నాడు. సురేశ్ ఉలిక్కిపడ్డాడు.. " ఏంది ఏమంటున్రు, దమాక్ గిట్ల ఖరాబయ్యిందా" అని ఊగిపోయాడు. "అయ్యో నేనేమన్నానయ్యా బాబూ, మీ వోడేదో మందలించమంటేనూ.." అని నీళ్ళు నములుతూ " మావైపు మందలించడమంటే ఇంతే" గబ గబా రావుగోపాల్రావు ఇష్టయిల్లో అనేసాడు అప్పారావ్.. " ఏందివయ్య? ఇదేందివయ్యా, మందలించుడంటే మర్డర్ చేసుడా ఏందయ్య? మా తాన మందలించుమంటె ముద్దుగా బాగున్నవా తమ్మీ అని మందలిస్తరు" అన్నాడు ఎల్లయ్య ఉడుకిపోతూ. ఇంకేదో అనబోతుండగా గట్టిగా బాజాలు మోగాయి. ఆడ పెళ్ళివారొచ్చారని, పెళ్ళి కొడుకుని పల్లకీ ఎక్కడానికి రమ్మని అడగ్గా, బావ మరుదులొచ్చి, భుజాల పైన ఎక్కించుకునెళ్ళాలని పెద్దలు పట్టుబట్టారు. సరిత కి అన్న వరసయ్యే పది మంది అతి కష్టమ్మీద సురేశ్ ని దాదాపు ఈడ్చుకెళ్ళి.. " అబ్బా.. అలవాటు లేని అవపోసన" అని ఆయాసపడ్డారు. ఈ క్రమంలో, సరిత అన్నగారి చేతిలో ఉన్న ఒక పుస్తకం పట్టుకోమని పక్కనున్న పిల్లడికిచ్చాడు. పల్లకీ సంబరం లో మునిగిపోయి అప్పారావ్ సంగతప్పటికి మరచిపోయాడుసురేశ్ . అప్పారావునీ, గోపాల్ నీ అసలు ఎప్పుడొచ్చారని అడిగే సమయం కూడా ఇవ్వకుండానే "అమ్మా ముహూర్తానికి టైం అవుతోంది.. మీరేమో తిరుపతమ్మ గుడులనీ, వాళ్ళేమో గండి మైసమ్మ గుడులనీ తిరిగి తిరిగొచ్చి, ముహూర్తం దాటించేసేట్టున్నార"ని ఖంగారు పెట్టేసారు పంతులు గారు. పంతులు గారి ఆరాటం, ఫొటో గ్రాఫర్ల పోరాటం మధ్య పెళ్ళి అయింది. సరిత అన్నగారి దగ్గర పుస్తకం తీసుకున్న పిల్లాడు పుస్తకం చూసేటప్పటికి అది బాపు రమణల "కోతి కొమ్మచ్చి". మొహమాస్తుడైన ఆ పిల్లాడికి ఎవరితోనూ పెద్దగా కలవడం ఇష్టం ఉండదు. పుస్తకం తీసి మెల్లగా చదవడం మొదలెట్టేసరికి పెళ్ళి అయిపోయి, ఆలస్యమైతే అందదన్నట్టు అందరూ పొలోమని భోయినాల వైపు పరుగులు తీసారు. పుస్తకం ఇచ్చేసి భోజనానికెళితే బెటర్ అనుకుంటూ ఎరుపు చొక్కా వేసుకున్న సరిత అన్నగారి కోసం వెతకడం మొదలెట్టాడు. అక్కడా ఇక్కడా దూరం నించి చూసి దగ్గరికెళ్ళేలోపు, అతను ఇంకేదో పని ఉండి మాయవడం జరిగింది రెండు సార్లు. ఈ లోపు భోజనం చేసి వచ్చి, కాస్త జనాలు పలచబడడం తో మళ్ళీ పందిరి వైపు ఎర్ర చొక్కా అబ్బాయి కోసం వెతకడం మొదలెట్టాడు. చివరికి జంటకి స్నేహితులని పరిచయం చేస్తూ కనబడ్డాదు ఎర్ర చొక్కా వేసుకున్న సరిత అన్నగారు మురళి. హమ్మయ్య అనుకుంటూ అటువెళ్ళి " సార్, మీ పుస్కం" అన్నాడు . " ఓహ్ నీకిచ్చాను కదా, ఎవరి చేతులోనో పెట్టా కానీ, ఎవరి చేతులో గమనించలేదు" అన్నాడు మురళి . " అస్సలనుకోలే సార్ బుక్ బాగుంటదని, నగీ నగీ సచ్చిన" అన్నాడు మల్లేష్. " ఓహ్ నచ్చిందా అయితే" అన్నాడు మురళి. " మస్త్ నచ్చింది సార్" అన్నాడు మల్లేష్ మురిపెంగా. " నచ్చిందా , అయితే ఉంచు" అన్నాడు మురళి. " అయ్యొ బాగుండదు సార్" అని మొహమాట పడ్డాడు మల్లేష్. " ఏం ఫర్వాలేదు ఉంచెయ్" అన్నాడు మురళి. " అయ్యొ సార్ ఎవరన్న చూస్తె ఏమనుకుంటరు" అన్నాడు మల్లేష్.. " దీన్లో అనుకోడానికేముంది, నా దగ్గరింకా 3 కాపీలున్నాయి, ఉంచెయ్ చెప్తాను" అని మురళి అంటుండగానే, మల్లేష్ ఖాండ్రించి పుస్తకం మీద ఉమ్మేసాడు. ఈ హటాత్పరిణామానికి ఉగ్రుడయిపోయాడు మురళి. " చదువుకున్నోడివనుకుని మర్యాద ఇస్తుంటే సంస్కారహీనంగా ప్రవర్తిస్తావా, పిచ్చెక్కిందా " అంటూ గుభీ గుభీ రెండు గుద్దులు గుద్ది "చీ" అంటూ వెళ్ళిపోయాడు. మల్లేష్ ముక్కులోంచి రక్తం కారిపోతుండగా పెళ్ళికొడుకు తరఫు పెద్దలు పరిగెత్తుకొచ్చారు. సరిత వైపు వాళ్ళని దుమ్మెత్తిపోస్తూ, " బిడ్డనెట్లగొట్టిన్రు చూసిన్రా, ముక్కులల్ల రక్తమెలతాంది.. పిలగాడు పండుకొంటుండు బిరాన దవాఖానా కి తీస్కపోదాం పట్టున్రి” అని అరుపులు మొదలెట్టారు. సరిత మేన మామొచ్చి,, “చావు బతుకుల్లో ఉంటే ఇప్పుడు పండు కొనడం పువ్వులు కొనడం ఏంటండీ ఆసుపత్రికి తీసుకెళ్ళక “అంటూ వెటకారమాడాడు. ఇంక సురేశ్ వైపు వాళ్ళు కోపానికొచ్చి అతన్ని ఒక్క పీకుడు పీకారు. వీళ్ళూరుకుంటారేంటీ,, కర్రలు, గునపాలూ, గొడ్డల్లూ, కత్తులు కటార్లూ పట్టుకుని తయారయిపోయారు. ఓయ్య పిల్ల తండ్రిని తోల్కరండ్రి బిరాన అనరిచింది సురేష్ పెద్దమ్మ. ఆయ్ నేనేమైనా గొర్రెనా గాడిదనా తోలుకురావడానికంటూ వచ్చాడు వెంకట్రావు. అరుంధతీ నక్షత్రం చూపించడానికి గేటు బయటకి జంటను తీసుకెళుతున్న పంతులు గారు ఈ గొడవకి ఆశ్చర్యపోయి "ఏంటండీ ఇది, ఏం జరుగుతోందిక్కడ? అనడిగాడు. “ ఇదేదో మంచి ఆరంభమనుకున్నాం కానీ ఈ పెళ్ళ్ళి వలన ఇప్పటికే ఇన్ని సమస్యలు, ఇంక. మంగళమే” అని అటువాళ్ళూ, ఇటువాళ్ళూ అంజలి సినిమాలో డవిలాగుల్లా అరిచి అరిచి చెప్పారు. పంతులు కాస్త ఆలోచించి కొట్టడానికి కారణమడిగాడు. పుస్తకముంచుకోమంటే పుస్తకం మీద ఉమ్మడం గురించి చెప్పగానే నవ్వడం మొదలెట్టాడాయన.. ఎప్పుడో కోనసీమ నించి వచ్చిన పూర్వీకుల వల్ల అటూ ఇటూ రెండు యాసలనూ క్షుణ్ణం గా తెలుసుకున్నవాడై “ఉంచడమంటే ఉమ్మడమని “ టిప్పణి చెప్పాడు. ముక్కులో రక్తమోడుతున్న మల్లేష్ తో సహా అందరూ పక పకా నవ్వారు. గోపాల్ కి పౌరుషమొచ్చి, పెళ్ళికొడుకు తనని దవడ వాచేట్టు కొట్టాడని, పెళ్ళికి un do బటన్ ఉంటే నొక్కెయ్యాలని గోల పెట్టాడు. “కొట్టమంటే మరి కొట్టనా” అని సురేశ్" నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా" అని కథ చెప్పే అబ్బాయంత అమాయకంగా చెప్పాడు. “నువ్వెందుకు కొట్టమన్నావ”ని అడిగిన పంతులు గిరిధర శర్మతో, “వ్యాపారమేంటంటే కొట్టు అని చెప్పాన”ని అమాయకంగా చెప్పాడు గోపాలు. “కొట్టంటే దుక్నమయ్యా బాబూ” అంటూ పడీ పడీ నవ్వాడు పంతులు గారు. “అన్ని మంచిగనే గని ఈ దొంగమొకపోడు ఎన్ని తిట్లు తిట్టిండు” అని అందుకున్నాడు ఎల్లయ్య. “చేపా చేపా ఎందుకెండలేదు” అని అడిగినట్టు “నీ కథ ఏంటయ్యా” అని నవ్వుతూ అడిగాడు గిరిధర శర్మ. “అయ్యా మందలించమని మరీ బలవంతం పెడితేనూ.”.. అంటున్న అప్పారావుని చూసి కడుపు పట్టుకుని " నేనింక నవ్వలేనయ్యా బాబూ, మందలించడమంటే, పలకరించడమని, పనిలో పనిగా పండుకొనడమంటే నిద్దరోడమనీ, తోల్కరావడమంటే తోడ్కొనిరావడానికి వికృతని చెప్పి..”ఇంతటితో అపార్థాల కథ కంచికి మనమింటికి.. ఇప్పుడైనా అర్థం తెలుసుకుని మాట్లాడుకోండి నాయనోయ్ “అంటూ అరుంధతిని చూపించడానికి దంపతులనిk తీసుకెళ్ళబోతున్నాడు పంతులు. అంత మంచిగ జెప్పిండు పంతుల్ నోట్ల పేడ పెట్టున్రి... అనగానే మళ్ళీ రెచ్చిపోబోతున్న వెంకట్రావుకి.. అయ్యా పాలకోవాని పేడాలంటారు మీరు తొందరపడి మళ్ళీ మొదటికి తేకండయా.. కథాకళలో పదినిమెషాలే ఇచ్చారు అరిచాడు. అయితే వాకే మళ్ళీ కలుద్దామంటూ వెళ్ళి పోయారు బంధుమిత్రులువియ్యాలవారి కయ్యాలు రచన: ఎన్నెలమ్మ, కెనడా “ఏం పని చేస్తరో?” అడిగాడు సురేశ్ తన పెళ్ళికొచ్చిన గోపాల్ ని. అతను అమ్మాయి వైపు చుట్టం కానీ రైలు తొందరగా వచ్చెయ్యడంతో, ఇంకా ఆడపెళ్ళివారు మంటపానికి రాక ముందే వచ్చిన మూలాన మాట కలిపాడు మర్యాదగా ఉంటుందని. "వ్యాపారం" అన్నాడు గోపాలం. "యాపారమా ఏం యాపారం?"అడిగాడు సురేశ్. " కొట్టు" అన్నాడు గోపాల్. "ఆ? ఏందీ" వినిపించనట్టు అడిగాడు సురేశ్ "కొట్టండీ.. కొట్టు కొట్టు" అని అన్నాడో లేదో గోపాల్ చెంప మీద ఫెళ్ళున కొట్టాడు సురేశ్. గోపాల్ ఈ దెబ్బకి నివ్వెరపోయాడు. పెళ్ళి కొడుక్కి కాస్త మెంటలా అని అనుమానమొచ్చేసింది ఒక నిమిషం లో.వాళ్ళ వాళ్ళు వచ్చారేమో అని చుట్టూ చూస్తున్నట్టు చేసి, నెమ్మదిగా జారుకున్నాడు.. చెప్పెయ్యాలి.. వాళ్ళ వాళ్ళు రాగానే చెప్పెయ్యాలని హాలు గేటు దగ్గరే నిరీక్షించాడు. " అదేందయ్య ఈడికొచ్చినవ్? పెండ్లి పిల్ల సైడ్ కెంచి చుట్టపాయనొచ్చిండు చాయ్ బిస్కీట్ అరుసుకోమంటె ఏడున్నడో అని దోలాడలేక పరేషానయితున్న.. హమ్మ దొర్కవట్టిన్నన్నట్టు" సంతోషం గా చెప్పుకుపోతున్నాడు ఎల్లయ్య. చుట్టపాయిన, టీ బిస్కీట్ తప్ప ఏమర్థమయినా కాకపోయినా, అరుచుకోవడమేంటీ ఆయన కొట్టినా కుక్కినపేనల్లే నోరుమూసుకుని ఉంటే మళ్ళీ ఈయన తీసుకెళ్ళి అరుస్తాడేమో అని అయోమయం గా చూస్తున్నాడు గోపాల్. " కొర్కతింటామయ్య బీరిపోయినవ్.. .. నడ్వు పోదాంపా" అంటూ రమ్మని తొందర చేసాడు ఎల్లయ్య. ఇదెక్కడ గోలరా బాబూ, అసలు వాళ్ళు “రాజమండ్రి వచ్చెయ్ బావా అందరం కలిసి వెళదాం సరదాగా” అంటున్నా, ఎలాగూ ఏదో పనిమీద హైదరాబాదొచ్చాను కదా.. ఇటునించిటే అయితే టైం , టికెట్టు కలిసొస్తుందని కక్కుర్తి పడ్డాను అనవసరం గా " అనుకుంటూ ఎందుకో వెనుతిరిగి చూస్తే దూరం నించి వస్తూ కనిపించాడు అప్పా రావు. గోపాల్ ఎల్లయ్య వైపు తిరిగి.. " ఒక్క నిమిషం ఆగండి, మా చుట్టం ఇంకొకడు వస్తున్నాడు, ఇద్దరం కలిసొస్తాము చాయ్ బిస్కీట్ కి " చివరి పదం యాస మార్చి అనేసాడు సంతోషం గా.. " కానియ్యున్రి, మేమేమన్న కాదన్నాము.. " అన్నాడు ఎల్లయ్య. గోపాల్, అప్పారావు ఒకరినొకరిని చూసుకుని చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టారు. దడ దడా మాట్లేసుకుంటున్న వాళ్ళని " గీ లొల్లెప్పటికొడిశేనో" అనుకుంటూ చూస్తున్న ఎల్లయ్యని సురేశ్ పిలవడంతో అటెళ్ళాడు. గోపాల్ , అప్పారావ్ కబుర్లలో పడి నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్న చోటకి నడవసాగారు. తను లేకుండా వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోవడం చూసిన ఎల్లయ్య.. " ఓ గోపాలూ, మీ చుట్టపాయన పెండ్లి పిలగాన్ని మందలించకుంటనే పోతడా" అని అరిచాడు. అప్పటి వరకూ పెళ్ళి పిలగాడు తనని కొట్టిన వైనం చెప్పి ఉన్న మూలాన కావచ్చు అప్పారావు చాన్స్ వదులుకోకుండా సురేశ్ దగ్గరగా వెళ్ళి " ఏం మనిషండీ మీరు, అసలు బుధ్ధుందా మీకు? మడిసన్నాక కూసింత కలాపోసనుండాల, .. లేదంతే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంది ? పొద్దున్నే ఇంత పచ్సగడ్డి తిని పెత్తెక్ష నారాయనుడి సేవ చేసుకోక..ఎందుకొచ్చిన గోలయ్యా , సెగట్రీ.. ఇలా సాగిపోతే మర్డర్రయిపోవూ " అన్నాడు. సురేశ్ ఉలిక్కిపడ్డాడు.. " ఏంది ఏమంటున్రు, దమాక్ గిట్ల ఖరాబయ్యిందా" అని ఊగిపోయాడు. "అయ్యో నేనేమన్నానయ్యా బాబూ, మీ వోడేదో మందలించమంటేనూ.." అని నీళ్ళు నములుతూ " మావైపు మందలించడమంటే ఇంతే" గబ గబా రావుగోపాల్రావు ఇష్టయిల్లో అనేసాడు అప్పారావ్.. " ఏందివయ్య? ఇదేందివయ్యా, మందలించుడంటే మర్డర్ చేసుడా ఏందయ్య? మా తాన మందలించుమంటె ముద్దుగా బాగున్నవా తమ్మీ అని మందలిస్తరు" అన్నాడు ఎల్లయ్య ఉడుకిపోతూ. ఇంకేదో అనబోతుండగా గట్టిగా బాజాలు మోగాయి. ఆడ పెళ్ళివారొచ్చారని, పెళ్ళి కొడుకుని పల్లకీ ఎక్కడానికి రమ్మని అడగ్గా, బావ మరుదులొచ్చి, భుజాల పైన ఎక్కించుకునెళ్ళాలని పెద్దలు పట్టుబట్టారు. సరిత కి అన్న వరసయ్యే పది మంది అతి కష్టమ్మీద సురేశ్ ని దాదాపు ఈడ్చుకెళ్ళి.. " అబ్బా.. అలవాటు లేని అవపోసన" అని ఆయాసపడ్డారు. ఈ క్రమంలో, సరిత అన్నగారి చేతిలో ఉన్న ఒక పుస్తకం పట్టుకోమని పక్కనున్న పిల్లడికిచ్చాడు. పల్లకీ సంబరం లో మునిగిపోయి అప్పారావ్ సంగతప్పటికి మరచిపోయాడుసురేశ్ . అప్పారావునీ, గోపాల్ నీ అసలు ఎప్పుడొచ్చారని అడిగే సమయం కూడా ఇవ్వకుండానే "అమ్మా ముహూర్తానికి టైం అవుతోంది.. మీరేమో తిరుపతమ్మ గుడులనీ, వాళ్ళేమో గండి మైసమ్మ గుడులనీ తిరిగి తిరిగొచ్చి, ముహూర్తం దాటించేసేట్టున్నార"ని ఖంగారు పెట్టేసారు పంతులు గారు. పంతులు గారి ఆరాటం, ఫొటో గ్రాఫర్ల పోరాటం మధ్య పెళ్ళి అయింది. సరిత అన్నగారి దగ్గర పుస్తకం తీసుకున్న పిల్లాడు పుస్తకం చూసేటప్పటికి అది బాపు రమణల "కోతి కొమ్మచ్చి". మొహమాస్తుడైన ఆ పిల్లాడికి ఎవరితోనూ పెద్దగా కలవడం ఇష్టం ఉండదు. పుస్తకం తీసి మెల్లగా చదవడం మొదలెట్టేసరికి పెళ్ళి అయిపోయి, ఆలస్యమైతే అందదన్నట్టు అందరూ పొలోమని భోయినాల వైపు పరుగులు తీసారు. పుస్తకం ఇచ్చేసి భోజనానికెళితే బెటర్ అనుకుంటూ ఎరుపు చొక్కా వేసుకున్న సరిత అన్నగారి కోసం వెతకడం మొదలెట్టాడు. అక్కడా ఇక్కడా దూరం నించి చూసి దగ్గరికెళ్ళేలోపు, అతను ఇంకేదో పని ఉండి మాయవడం జరిగింది రెండు సార్లు. ఈ లోపు భోజనం చేసి వచ్చి, కాస్త జనాలు పలచబడడం తో మళ్ళీ పందిరి వైపు ఎర్ర చొక్కా అబ్బాయి కోసం వెతకడం మొదలెట్టాడు. చివరికి జంటకి స్నేహితులని పరిచయం చేస్తూ కనబడ్డాదు ఎర్ర చొక్కా వేసుకున్న సరిత అన్నగారు మురళి. హమ్మయ్య అనుకుంటూ అటువెళ్ళి " సార్, మీ పుస్కం" అన్నాడు . " ఓహ్ నీకిచ్చాను కదా, ఎవరి చేతులోనో పెట్టా కానీ, ఎవరి చేతులో గమనించలేదు" అన్నాడు మురళి . " అస్సలనుకోలే సార్ బుక్ బాగుంటదని, నగీ నగీ సచ్చిన" అన్నాడు మల్లేష్. " ఓహ్ నచ్చిందా అయితే" అన్నాడు మురళి. " మస్త్ నచ్చింది సార్" అన్నాడు మల్లేష్ మురిపెంగా. " నచ్చిందా , అయితే ఉంచు" అన్నాడు మురళి. " అయ్యొ బాగుండదు సార్" అని మొహమాట పడ్డాడు మల్లేష్. " ఏం ఫర్వాలేదు ఉంచెయ్" అన్నాడు మురళి. " అయ్యొ సార్ ఎవరన్న చూస్తె ఏమనుకుంటరు" అన్నాడు మల్లేష్.. " దీన్లో అనుకోడానికేముంది, నా దగ్గరింకా 3 కాపీలున్నాయి, ఉంచెయ్ చెప్తాను" అని మురళి అంటుండగానే, మల్లేష్ ఖాండ్రించి పుస్తకం మీద ఉమ్మేసాడు. ఈ హటాత్పరిణామానికి ఉగ్రుడయిపోయాడు మురళి. " చదువుకున్నోడివనుకుని మర్యాద ఇస్తుంటే సంస్కారహీనంగా ప్రవర్తిస్తావా, పిచ్చెక్కిందా " అంటూ గుభీ గుభీ రెండు గుద్దులు గుద్ది "చీ" అంటూ వెళ్ళిపోయాడు. మల్లేష్ ముక్కులోంచి రక్తం కారిపోతుండగా పెళ్ళికొడుకు తరఫు పెద్దలు పరిగెత్తుకొచ్చారు. సరిత వైపు వాళ్ళని దుమ్మెత్తిపోస్తూ, " బిడ్డనెట్లగొట్టిన్రు చూసిన్రా, ముక్కులల్ల రక్తమెలతాంది.. పిలగాడు పండుకొంటుండు బిరాన దవాఖానా కి తీస్కపోదాం పట్టున్రి” అని అరుపులు మొదలెట్టారు. సరిత మేన మామొచ్చి,, “చావు బతుకుల్లో ఉంటే ఇప్పుడు పండు కొనడం పువ్వులు కొనడం ఏంటండీ ఆసుపత్రికి తీసుకెళ్ళక “అంటూ వెటకారమాడాడు. ఇంక సురేశ్ వైపు వాళ్ళు కోపానికొచ్చి అతన్ని ఒక్క పీకుడు పీకారు. వీళ్ళూరుకుంటారేంటీ,, కర్రలు, గునపాలూ, గొడ్డల్లూ, కత్తులు కటార్లూ పట్టుకుని తయారయిపోయారు. ఓయ్య పిల్ల తండ్రిని తోల్కరండ్రి బిరాన అనరిచింది సురేష్ పెద్దమ్మ. ఆయ్ నేనేమైనా గొర్రెనా గాడిదనా తోలుకురావడానికంటూ వచ్చాడు వెంకట్రావు. అరుంధతీ నక్షత్రం చూపించడానికి గేటు బయటకి జంటను తీసుకెళుతున్న పంతులు గారు ఈ గొడవకి ఆశ్చర్యపోయి "ఏంటండీ ఇది, ఏం జరుగుతోందిక్కడ? అనడిగాడు. “ ఇదేదో మంచి ఆరంభమనుకున్నాం కానీ ఈ పెళ్ళ్ళి వలన ఇప్పటికే ఇన్ని సమస్యలు, ఇంక. మంగళమే” అని అటువాళ్ళూ, ఇటువాళ్ళూ అంజలి సినిమాలో డవిలాగుల్లా అరిచి అరిచి చెప్పారు. పంతులు కాస్త ఆలోచించి కొట్టడానికి కారణమడిగాడు. పుస్తకముంచుకోమంటే పుస్తకం మీద ఉమ్మడం గురించి చెప్పగానే నవ్వడం మొదలెట్టాడాయన.. ఎప్పుడో కోనసీమ నించి వచ్చిన పూర్వీకుల వల్ల అటూ ఇటూ రెండు యాసలనూ క్షుణ్ణం గా తెలుసుకున్నవాడై “ఉంచడమంటే ఉమ్మడమని “ టిప్పణి చెప్పాడు. ముక్కులో రక్తమోడుతున్న మల్లేష్ తో సహా అందరూ పక పకా నవ్వారు. గోపాల్ కి పౌరుషమొచ్చి, పెళ్ళికొడుకు తనని దవడ వాచేట్టు కొట్టాడని, పెళ్ళికి un do బటన్ ఉంటే నొక్కెయ్యాలని గోల పెట్టాడు. “కొట్టమంటే మరి కొట్టనా” అని సురేశ్" నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా" అని కథ చెప్పే అబ్బాయంత అమాయకంగా చెప్పాడు. “నువ్వెందుకు కొట్టమన్నావ”ని అడిగిన పంతులు గిరిధర శర్మతో, “వ్యాపారమేంటంటే కొట్టు అని చెప్పాన”ని అమాయకంగా చెప్పాడు గోపాలు. “కొట్టంటే దుక్నమయ్యా బాబూ” అంటూ పడీ పడీ నవ్వాడు పంతులు గారు. “అన్ని మంచిగనే గని ఈ దొంగమొకపోడు ఎన్ని తిట్లు తిట్టిండు” అని అందుకున్నాడు ఎల్లయ్య. “చేపా చేపా ఎందుకెండలేదు” అని అడిగినట్టు “నీ కథ ఏంటయ్యా” అని నవ్వుతూ అడిగాడు గిరిధర శర్మ. “అయ్యా మందలించమని మరీ బలవంతం పెడితేనూ.”.. అంటున్న అప్పారావుని చూసి కడుపు పట్టుకుని " నేనింక నవ్వలేనయ్యా బాబూ, మందలించడమంటే, పలకరించడమని, పనిలో పనిగా పండుకొనడమంటే నిద్దరోడమనీ, తోల్కరావడమంటే తోడ్కొనిరావడానికి వికృతని చెప్పి..”ఇంతటితో అపార్థాల కథ కంచికి మనమింటికి.. ఇప్పుడైనా అర్థం తెలుసుకుని మాట్లాడుకోండి నాయనోయ్ “అంటూ అరుంధతిని చూపించడానికి దంపతులనిk తీసుకెళ్ళబోతున్నాడు పంతులు. అంత మంచిగ జెప్పిండు పంతుల్ నోట్ల పేడ పెట్టున్రి... అనగానే మళ్ళీ రెచ్చిపోబోతున్న వెంకట్రావుకి.. అయ్యా పాలకోవాని పేడాలంటారు మీరు తొందరపడి మళ్ళీ మొదటికి తేకండయా.. కథాకళలో పదినిమెషాలే ఇచ్చారు అరిచాడు. అయితే వాకే మళ్ళీ కలుద్దామంటూ వెళ్ళి పోయారు బంధుమిత్రులు

0 వ్యాఖ్యలు: